హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అమెరికా రాయబార కార్యాలయం జారీచేసే ప్రతి నాలుగు వీసాల్లో ఒక వీసా మన దేశానిదే ఉంటోంది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది. ఇదే విషయాన్ని ఢల్లీిలోని అమెరికా రాయబార కార్యాలయం (ఎంబసీ) తాజాగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడిరచింది. అమెరికా చదువుల క్రేజ్ ఎంత మాత్రం తగ్గడం లేదు. కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత మరింత పుంజుకుంది. నేపథ్యంలో డిమాండ్కు తగినట్లుగా అమెరికా సైతం వీసాలను జారీచేస్తున్నది. గత ఏడాది మొత్తంగా 1.25 లక్షల విద్యార్థి వీసాలను అమెరికా జారీచేసింది. ఏడాది వేసవిలో 82 వేల విద్యార్థి వీసాలను అందజేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదని.. ఈ ఏడాది విద్యార్థి వీసాలను మరింత ఎక్కువగా జారీచేసే అవకాశాలున్నాయని ఇటీవలే ఎంబసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో మూడు మాసాల్లోనే 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది. అమెరికాలో ఏటా రెండు సార్లు ప్రవేశాలు కల్పిస్తారు. ఆగస్టు `డిసెంబర్ సెమిస్టర్ సమయంలో మన విద్యార్థులు అమెరికా బాట పడుతుంటారు. మనవాళ్లు ఎంఎస్తో పాటు, బీఎస్ కోర్సుల్లోను చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.