స్లాబ్ను తొలగించిన మున్సిపల్ అధికారులు
కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్ ఏరియా లో యూనియన్ బ్యాంక్ ఎదురుగా మున్సిపాల్టీ నిర్మించిన డ్రైయినేజీని కబ్జా చేసి స్లాబ్ పోసి రూం నిర్మించడానికి సిద్ధపడ్డారు. ముడుపులు తీసు కొని చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్న మున్సిపల్ అధికారులు తీరుపై డ్రైయినేజీని సైతం వదలని కబ్జారాయుళ్లు, ఏకంగా స్లాబ్ పోసి రూం నిర్మించేందుకు రంగం సిద్ధం, ముడుపులు ముట్టడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు అంటూ ఆదాబ్ ప్రత్యేక కథనాన్ని ఈనెల 12న ప్రచురించింది. దీంతోమున్సిపల్ అధికారులు బుధవారం డ్రైయినేజీపై అక్రమంగా స్లాబ్ పోసిన దాన్ని జెసిబితో తొలగించారు.