Friday, April 26, 2024

పార్టీ కోసం ఓ మెట్టు దిగుతా..

తప్పక చదవండి
  • మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం..
  • ఈటలకు కాంగ్రెస్‌లోకి వెల్కమ్ చెప్పిన రేవంత్ రెడ్డి
  • అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలి..
  • తనను తిట్టినా పడతానని.. ఎన్నిసార్లయినా తలొంచుతాను
  • నాతో ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడవచ్చు : రేవంత్

హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను విడిచిపోయిన అందరూ తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.. వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఆహ్వానించారు. అయితే.. వీళ్లంతా బీజేపీలో ఇమడలేకపోతున్నారని.. ఎరక్కపోయి ఆ పార్టీలో ఇరుక్కుపోయారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో.. ఓ ప్రేమించిన అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోవటాన్ని ఉదాహరణగా వివరించారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిదని.. ఎవరైనా పార్టీలోకి రావచ్చని తెలిపారు.

ఇటీవల పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే… తనను ఎవ్వరు తిట్టినా పట్టించుకోనని.. కావాలంటే పది మెట్లైనా కిందికి దిగుతానని చెప్పుకొచ్చారు. తన నాయకత్వం ఎవ్వరు పని చేయాల్సిన పని లేదని.. తానే మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పని చేస్తున్నానని చెప్పారు. అయితే.. క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నవారంతా మళ్లీ తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. కేసీఆర్ వ్యతిరేక వర్గమంతా ఒక్కటై.. గద్దె దించేందుకు పోరాడాలని సూచించారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు.. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం చర్చిస్తోందన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మార్గంలోనే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ నడుస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన పెడతామని ప్రకటించారు.

- Advertisement -

అయితే.. ఇటీవలే ఈటలకు.. రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. సవాళ్లు దాకా వెళ్లి.. రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం కూడా చేశారు. ఈ క్రమంలోనే.. ఇద్దరూ ఒకరిపై ఒకరు కీలక ఆరోపణలు చేసుకున్నారు. అయినప్పటికీ.. ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించటం చర్చనీయాంశంగా మారింది. అయితే.. రేవంత్ ఇలా ఆహ్వానించటం వెనుక మతలబు మాత్రం.. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేయటమే అని శ్రేణులు చెప్తున్నాయి. అటు కేసీఆర్‌ను గద్దె దించటమే కాకుండా.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకే.. ఇలా బీజేపీలోకి వెళ్లిన బలమైన నాయకులను బహిరంగంగా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి.. వాళ్ల రియాక్షన్ ఎలా ఉండనుందో..!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు