- ఆరా లైట్తో సరికొత్త ప్రీమియం వై సిరీస్ స్మార్ట్ఫోన్ వై 200 విడుదల..
హైదరాబాద్ : వివో, వినూత్న గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్, ఈ రోజు భారతదేశంలో వీవు వై 200 లాంచ్తో దాని ప్రీమియం వై – సిరీస్ లైనప్ను విస్తరించింది. కొత్తగా ప్రారంభించబడిన స్మార్ట్ఫోన్ 64 ఎంపీ ఓ ఐ ఎస్ యాంటీ-షేక్ కెమెరాతో పాటు వీవో యొక్క సరికొత్త విప్లవాత్మక స్మార్ట్ ఆరా లైట్ టెక్తో పాటు 120 హెచ్ జెడ్ అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ప్లే, వేగవంతమైన 44 డబ్ల్యు ఫ్లాష్ ఛార్జ్తో సహా ఆకట్టుకునే ఫీచర్ల శ్రేణిని కలిగి ఉంది. డెసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వై 200 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్కు రూ. 21,999 ధరతో ఉంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వీవో ఇండియా ఇ-స్టోర్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఎస్.బీ.ఐ., ఇండస్ ఇండ్, ఐ.డీ.ఎఫ్.సి. ఫస్ట్, ఎస్ బ్యాంకు, ఇతర ఆర్థిక భాగస్వాములను ఉపయోగించి వినియోగదారులు రూ. 2,500 వరకు క్యాష్బ్యాక్ను కూడా పొందవచ్చు.