Tuesday, May 21, 2024

ప్రజల అండతో.. మందుకు సాగుతున్న

తప్పక చదవండి
  • ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మనదే
  • పార్టీలు మోసం చేసాయి కానీ ప్రజలు కాదు…
  • బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

తనను పార్టీలు నమ్మించి మోసం చేశాయి గానీ పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు మాత్రం తన పక్షానని ఉన్నారనడానికి మీరంతా నావెంట ఈ రోజు నిలబడడం నిదర్శనమని, నాకున్న మద్దతు చూసి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలైందని బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. తనకు మద్దతుగా తరలివచ్చిన అభిమానులు, అనుచరులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు మన ఆత్మగౌరవ పోరాటాన్ని అవహేళన చేసేలా ప్రవర్తించాయని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు మేరకు తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుచున్నట్లు స్పష్టం చేశారు.

పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ సదువు మల్లేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి ఆంజనేయులు మరికొందరు నాయకులు పటాన్చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో బీఎస్పి పార్టీ లో చేరారు. వారితో పాటు షరీఫ్, వడ్ల రాజు, మహేష్, అబ్దుల్ అజీజ్, బీరేందర్, సాయిలు, ప్రభంజన్, కె ప్రవీణ్, అబ్దుల్ వహీద్, అబ్దుల్ గఫ్ఫార్, మహమ్మద్ ఖలీల్, తిరుపతి ఋషిదేవ్ తదితరులు పార్టీలో చేరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు