Sunday, May 19, 2024

ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకుంటాం

తప్పక చదవండి
  • కోటపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ
    వికారాబాద్‌ :వికారాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం బీరోల్‌ గ్రామానికి చెందిన తాండ్ర మాణిక్యం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తూ బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గత నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో ఏకంగా గులాబీ కండువా దరించడంతో ఈ సంఘటన వికారాబాద్‌ నియోజక వర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా పని చేస్తూ ఓ రాజకీయ పార్టీకి ప్రచారం చేయడమే గాకుండా మెడలో దర్జాగా గులాబీ కండువా వేసుకొని బిఆర్‌ఎస్‌ జిందాబాద్‌.. డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ నాయకత్వం వర్ధిల్లాలని జై కొట్టడంపై అటు గ్రామస్థులతో పాటు ఆయా పార్టీలకు చెందిన నాయకులు తీవ్రంగా కండిస్తున్నరు. అతడికి తెలియక పోయినా కనీసం ఎమ్మెల్యే ఆలోచించాలి కదా అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి శుక్రవారం ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో ప్రత్యేక కథనం వెలువడిరది. దీనిపై స్పందించిన కోటపల్లి మండల ఎంపీడీవో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చేసిన నిర్వాకంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇట్టి విషయ మై పలువురు గ్రామస్తులు సైతం జిల్లా కలెక్టర్‌ కు పిర్యాదు చేయనున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు