Tuesday, May 14, 2024

విజయహో విక్రమ్

తప్పక చదవండి

జాబిలిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ -3

  • దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశంగా నిలిచిన భారత్‌
  • 14 రోజుల పాటు పరిశోధనలు చేయనున్న రోవర్‌
  • సురక్షిత ల్యాండిరగ్‌ చేసిన నాలుగో దేశంగా రికార్డు
  • ఎలాంటి అడ్డంకులు లేకుండా సాప్ట్‌ ల్యాండిరగ్‌
  • ఇస్రో శాస్త్రవేత్తల అంతులేని ఆనందోత్సాహాలు
  • ప్రధాని మోడీ సహా పలువురి అభినందనలు
    15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని మొదటి జాబిల్లి యాత్ర చంద్రయాన్‌ 1 తోనే గుర్తించిన భారత్‌.. చంద్రయాన్‌ 3 ప్రయోగంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా నిలిచింది. చంద్రయాన్‌ 3 తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని దక్షిణ ధృవాన్ని ప్రపంచానికి చూపించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి..
    భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
    చంద్రయాన్‌ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి నేలపైన సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ విజయవంతం అయింది. 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడిపోయాయి. సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో సౌత్‌ పోల్‌ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.
    న్యూఢిల్లీ : చంద్రుడి దక్షిణధృవాన్ని ప్రజ్ఞాన్‌ ముద్దాడిరది. 41 రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ విజయం సాధించింది. దీంతో అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన సగర్వంగా నిలిచింది. చంద్రయాన్‌ ద్వారా భారత్‌ మరో అంతరిక్ష విజయాన్ని అందుకుంది.. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌3 విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాప్ట్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది మంది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. దేశం యావత్తూ సంబరాల్లో మునిగి పోయింది. చంద్రయాన్‌3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు. మరోవైపు భారత్‌ చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌3 పట్ల ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిని చూపాయి. రష్యా చేపట్టిన మూన్‌ మిషన్‌ లూనా 25 రెండు రోజుల కిందట విఫలమైంది. ఆ దేశ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై కూలిపోయింది. ఈ తరుణంలో ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి స్టాఫ్‌ ల్యాండిరగ్‌ కావడంపట్ల పలు దేశాలు ఆశ్చర్యపోయాయి. చంద్రయాన్‌3 సక్సెస్‌ పట్ల భారత్‌కు ప్రధానంగా ఇస్రోకు అభినందనలు తెలిపాయి. కాగా, ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్‌ ఈ ఘనత దక్కించుకున్నది. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించింది. స్పేస్‌ క్రాప్ట్‌ చంద్రుడి నేలపైన సాప్ట్‌ ల్యాండిరగ్‌ విజయవంతం కావడంతో 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడి పోయాయి. సాప్ట్‌ ల్యాండిరగ్‌ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాప్ట్‌ ల్యాండిరగ్‌ పక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో సౌత్‌ పోల్‌ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. సుమారు చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలో విూటర్ల ఎత్తులో ల్యాండర్‌ ఉండగా రఫ్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ మొదలు అయింది. ఆ ఫేస్‌ సజావుగానే సాగినట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో హారిజాంటల్‌ వెలాసిటీ 1200 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ల్యాండర్‌ వేగం ఉంది. ఒక్కసారి ఆటోమేటిక్‌ ల్యాండిరగ్‌ సిస్టమ్‌ (ఏఎల్‌ఎస్‌) యాక్టివేట్‌ అయిన అనంతరం గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఎలాంటి కమాండ్స్‌ ఇవ్వబోరని లైవ్‌ స్టీమ్రింగ్‌ కామెంటరీలో చెప్పారు. చంద్రుడి ఉపరితలం నుంచి 28 కిలో విూటర్ల ఎత్తులో విక్రమ్‌ ల్యాండర్‌ వర్టికల్‌ వెలాసిటీ 31 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, హారిజాంటల్‌ వెలాసిటీ 1058 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ఉంది. సాప్ట్‌ ల్యాండిరగ్‌ పక్రియ మొదలైన సరిగ్గా 8 నిమిషాల తర్వాత 21 కిలో విూటర్ల ఎత్తులో ల్యాండర్‌ ఉంది. అప్పుడు హారిజాంటల్‌ వెలాసిటీ 745 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, వర్టికల్‌ వెలాసిటీ 67 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ వెలాసిటీలో ఉంది. ఈ 8 నిమిషాల్లో 700 కిలో విూటర్లకు పైగా దూరం ల్యాండర్‌ ప్రయాణించింది. రఫ్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ తర్వాత స్టాండ్‌ బై స్టేజ్‌ లేదా ఆల్టిట్యూడ్‌ హోల్డ్‌ ఫేస్‌ మొదలు అయింది. తర్వాత పైన్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ మొదలు అయింది. ఇది మూడు నిమిషాలపాటు జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఎలాంటి కమాండ్స్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఇవ్వలేదు. ఈ సమయంలో హారిజాంటల్‌ వెలాసిటీ 120 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, వర్టికల్‌ వెలాసిటీ 28 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ఉంది. సరిగ్గా ఈ టైంలో ఉపరితం నుంచి ఎత్తు 1.2 కిలో విూటర్లుగా ఉంది. ఆ తర్వాత ల్యాండర్‌ ఉపరితలానికి లంబకోణం చేస్తూ తిరిగింది. మెల్లగా సెన్సార్ల సాయంతో హారిజాంటల్‌ వెలాసిటీ, వర్టికల్‌ వెలాసిటీని మరింత తగ్గించుకొని చంద్రుడి ఉపరితలం వైపు కదులుతూ ఉంది. చంద్రుడి పై దిగే ముందు హారిజాంటల్‌ వెలాసిటీ 0.4 విూటర్స్‌ పర్‌ సెకండ్‌, వర్టికల్‌ వెలాసిటీ 2 విూటర్స్‌ పర్‌ సెకండ్‌ గా ఉండి చివరికి ఉపరితలంపై క్షేమంగా దిగింది. దీంతో శాస్త్రవేత్తలు ఆనందంగా లేచి అభినందనలు పంచుకున్నారు. ప్రధాని మోడీ సైతం దీనిని ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు