జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఆరంభ సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో పీహెచ్ఎల్ తొలి సీజన్ మొదలైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో రాజస్థాన్ పాట్రియాట్స్, మహారాష్ట్ర ఐరన్మ్యాన్ పోటీపడ్డాయి. 28-27తో ఐరన్మ్యాన్పై పాట్రియాట్స్ ఒక్క గోల్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక తొలి రోజు రెండో మ్యాచ్లో తెలుగు జట్టు టాలన్స్ దుమ్మురేపింది. గార్విట్ గుజరాత్తో తలపడిన తెలుగు టాలన్స్ 39-32తో సాధికారిక విజయం సాధించి సీజన్లో బోణీ కొట్టింది. స్టార్ ఆటగాడు దేవెందర్ భుల్లార్, అనిల్ ఖుడియ, రఘులు మెరువగా.. ప్రథమార్థం ముగిసే సరికి 19-16తో మూడు గోల్స్ ముందంజలో నిలిచింది. ఆరంభంలో కాస్త తడబడిన టాలన్స్ 5-8తో వెనుకంజలో నిలిచింది. కానీ ఆటగాళ్లు లయ అందుకోగానే టాలన్స్ జోరు తగ్గలేదు. ద్వితీయార్థంలోనూ దూకుడుగా ఆడిన తెలుగు టాలన్స్ గోల్ కీపర్ రాహుల్ అడ్డుగోడతో గుజరాత్ను నిలువరించింది. సెకండ్ హాప్లో 21-18, 25-20, 31-24, 34-28తో తెలుగు టాలన్స్ ఆధిక్యం నిలుపుకుంది. 25-32 వద్ద ఉండగా వరుసగా మూడు గోల్స్ కొట్టిన గుజరాత్ ఊపందుకున్నప్పటికీ.. వ్యూహాత్మక విరామం తీసుకున్న టాలన్స్ మ్యాచ్పై పట్టు జారనివ్వలేదు.