Sunday, May 12, 2024

తెలంగాణ సామాజిక రచయితల సంఘం మరిపెడమండలం కన్వీనర్ గా కోనేటి వీరన్న నియామకం.

తప్పక చదవండి

తెలంగాణ సామాజిక రచయితల సంఘం మహబూబాద్ జిల్లా, మరిపెడ మండలం కన్వీనర్ గా.. మరిపెడ మండలానికి చెందిన రచయిత, కవి వీరన్నను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబులు తెలిపారు. ఈ మేరకు వారికి నియామక ఉత్తర్వులను అందించారు. అనంతరం సతీష్ రెడ్డి, రాంబాబులు మాట్లాడుతూ.. సమాజానికి దిక్సూచి రచయితలేనని, ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుందని, రచయితలు సమాజ వికాసానికి కృషి చేస్తూ.. సామాజిక అంశాలపై దృష్టిని కేంద్రీకరించి తమ రచనలు చేయాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వివిధ పత్రికలలో తమదైన శైలిలో వ్యాసాలు రాస్తున్న దిట్ట వీరన్న అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు సతీష్ రెడ్డికి, రాంబాబుకి వీరన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు