- షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ..
- వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంఖుస్థాపన..
- పలు ప్రారోంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ
హైదరాబాద్ : ఒక్కరోజు విశ్రాతి తరువాత రెండోసారి తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. ఇక ఆ షెడ్యూల్కు సంబంధించి పూర్తి మినిట్ టూ మినిట్ వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ మధ్యాహ్నాం 2:10 నిమిషాలకు.. బీదర్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ప్రధాని మోదీ.. 2:55 నిమిషాలకు.. బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకుంటారు.. 3:00 నుంచి 3:35 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.. 3:45 నుంచి 4:45 గంటల వరకు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు.. 4:55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 గంటలకు బీదర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.. అనంతరం ఢల్లీికి తిరుగు ప్రయాణం అవుతారు.
మోదీ ప్రారంబించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి :
నిజామాబాద్ పర్యటనలో 8 వేల 21కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తారు.. రామ గుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తారు.. అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతను ఈ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో బొగ్గు వినియోగం తక్కువ.. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.. 1360 కోట్లతో 496 బస్తీ దావాఖా నాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లను మోదీ ప్రారంభిస్తారు.. అలాగే ప్రతీ జిల్లాలో నిర్మించే పనులను మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారు.. 305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్ను ప్రజ లకు అంకితం చేస్తారు.. కొమురవెల్లి దేవస్థానం వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనుంది కేంద్రం..