సూర్యాపేట : చివ్వెంల మండల కేంద్రం లో 7 వ రోజు జె. జె. ఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘వేపకాయల బతుకమ్మ’’ వేడుకల్లో ఎస్.ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి పాల్గొనగా,ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి,స్థానిక శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.చిన్న పిల్లలతో కలిసి కోలాటం వేసి,అందరినీ ఆనందపరిచారు.వెంట ఎంపి బడుగుల లింగయ్య యాదవ్,జూలకంటి జీవన్ రెడ్డి,మహిళలు తదితరులు ఉన్నారు..