Saturday, April 27, 2024

కోత తప్పదు..

తప్పక చదవండి
  • భారీగా గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపులు
  • బాంబు పేల్చిన సిఇవో సుందర్‌ పిచాయ్‌
  • ఏడాది ఆరంభంలోనే ఉద్యోగులకు భారీ షాక్‌

శాన్‌ఫ్రాన్సిస్కో : గత ఏడాది టెక్‌ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడగా, కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతోంది. గూగుల్‌ ఇప్పటికే లేఆఫ్స్‌ ప్రకటించగా ఈ ఏడాదిలోనూ కొలువుల కోత ఉంటుందని ఏకంగా సెర్చింజన్‌ దిగ్గజం సీఈవో సుందర్‌ పిచాయ్‌ బాంబు పేల్చారు. ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్‌ మెమోలో ఈ ఏడాది జాబ్‌ కట్స్‌ ఉంటాయనే సంకేతాలు పంపారు. మరోవైపు కంపెనీలు పనిభారాలను తగ్గించుకునేందుకు ఏఐ సాప్ట్‌వేర్‌, ఆటోమేషన్‌ వైపు మళ్లుతున్న క్రమంలో కొలువుల కోతపై ఆందోళన నెలకొన్న నేపధ్యంలో సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది ఉద్యోగుల కుదింపు తరహాలో ఈసారి తొలగింపులు ఉండవని, ప్రతి టీమ్‌లోనూ లేఆఫ్స్‌ ప్రభావం ఉండదని ఉద్యోగులకు పంపిన మెమోలో పిచాయ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్ధేశిరచుకున్నామని, అందుకు అనుగుణంగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడతామని పేర్కొననారు. కాగా వాయిస్‌ అసిస్టెంట్‌ యూనిట్స్‌, పిక్సెల్‌, నెస్ట్‌, ఫిట్‌బిట్‌, యాడ్‌ సేల్స్‌ టీంకు సంబంధించిన హార్డ్‌వేర్‌ టీంకు చెందిన పలువురు ఉద్యోగులను తొలగించనున్నట్టు గతవారం గూగుల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్‌మెంటెడ్‌ రియాలిటీ విభాగంలోనూ ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు టెక్‌ దిగ్గజం వెల్లడించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు