- ఘనత సాధించిన 21 ఎల్లా అగం జైన్..
- అంతరిక్ష శాస్త్రవేత్త కావడానికి శిక్షణ..
- నాసాతో సహా 5 విభిన్న కార్యక్రమాలకు ఎంపిక..
ఇండోర్ : మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ దేశంలోనే పరిశుభ్రతలో నంబర్ 1గా ఉండటంతో పాటు పలు విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు ఇక్కడి యువత కూడా నగరానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో స్కీమ్ నంబర్ 74లో నివసిస్తున్న 21 ఏళ్ల అగం జైన్ ఎంపికయ్యాడు. నాసాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్కు ఆగమ్ ఎంపికయ్యాడు. ఇప్పుడు అతను అంతరిక్ష శాస్త్రవేత్త కావడానికి శిక్షణ తీసుకుంటాడు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన రెండవ భారతీయ విద్యార్థి అగం జైన్. ఇస్రోలో రెండు నెలల ఇంటర్న్షిప్ చేశానని ఆగమ్ జైన్ తెలిపారు. కాలేజ్ క్యాంపస్ ద్వారానే అతను ఇంటర్న్షిప్ పూర్తి చేశాడు.అ అక్కడ్నుంచే అతను ఇస్రో వెబ్సైట్కి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. ఇంజినీరింగ్ ఫలితాలు చూసి అక్కడ సెలెక్ట్ అయినట్టుగా అగం తెలిపాడు.. నాసాతో సహా మొత్తం ఐదు విభిన్న కార్యక్రమాలకు ఆగమ్ ఎంపికయ్యాడు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు ఆగం చెప్పారు. కార్యక్రమంలో ఎంపిక కోసం నాసా రెండు రౌండ్లలో పరీక్షలను నిర్వహిస్తుంది. మొదటి రౌండ్లో, నాసా ఆన్లైన్ రిటర్న్ పరీక్షను తీసుకుంటుంది. ఆ తర్వాత రెండవ రౌండ్లో, నాసాతో సంబంధం ఉన్న అధికారులు, శాస్త్రవేత్తలు ఇంటర్వ్యూలు తీసుకుంటారు.