Monday, May 20, 2024

అక్రమ సంబంధం కారణంగా భార్యని దారుణంగా చంపినా భర్త ….

తప్పక చదవండి

గ్వాలియర్‌: పెళ్లి సందర్భంగా ఒకరికొకరు ఎన్నో బాసలు చేసుకుంటారు. తమ దాంపత్య జీవితం గురించి ఎన్నెన్నో కలలు గంటారు. కానీ, ఆ తర్వాత ఏ చిన్న తేడా వచ్చినా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వాళ్లలో కొందరు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే, కొందరేమో పంతాలకు పోయి వాటిని మరింత పెద్దవి చేసుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో అలాంటి ఓ జంటే పిల్లలను అనాథలను చేసింది. భర్త చేతిలో భార్య హతమవగా, భార్యను చంపిన భర్త జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లోని ఖైరీ మొహల్లా ఏరియాలో రేఖా చౌధరి, కమ్లేశ్‌ చౌధరి అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అయితే, భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి కమ్లేష్‌ చౌధరి చేతిలో రేఖా చౌధరి హత్యకు గురైంది.
ఇంట్లో నిద్రపోతున్న రేఖా చౌధరి తలను కమ్లేశ్‌ చౌధరి గొడ్డలితో తెగ నరికాడు. తమ ఇద్దరూ పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు