Monday, May 6, 2024

హాకీలో అదరగొట్టిన భారత మహిళలు..

తప్పక చదవండి
  • స్పెయిన్‌ హాకీ సమాఖ్య శత వసంత ఉత్సవాల సందర్భంగా
    నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీలో భారత మహిళలు..

స్పెయిన్‌ హాకీ సమాఖ్య శత వసంత ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీలో భారత మహిళలు అదరగొట్టారు. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 3-0తో ఆతిథ్య జట్టును చిత్తు చేసి విజేతలుగా నిలిచారు. వందన కటారియా (22వ నిమిషం), మోనిక (48), ఉదిత (58) భారత్‌ తరపున గోల్స్‌ చేశారు. 3 దేశాల ఈ టోర్నీలో 4 మ్యాచ్‌ల ద్వారా 8 పాయింట్లు దక్కించుకున్న భారత్‌ టేబుల్‌ టాపర్‌గా ట్రోఫీ అందుకుంది. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసిన భారత్‌..రెండో పోరులో 2-2తో స్పెయిన్‌ను నిలువరించింది. ఇక మూడో మ్యాచ్‌లో 3-0తో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దాంతో టోర్నీ మొత్తం భారత జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇంగ్లండ్‌పై గెలుపుతో ఆత్మవిశ్వాసం నిండిన భారత్‌..స్పెయిన్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ పోరులో చెలరేగింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు