Friday, May 17, 2024

కర్నూలు లో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య..

తప్పక చదవండి
  • బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య
    అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ శుక్రవారం విధుల్లో చేరిన కొద్ది సేపటికే బాత్‌రూమ్‌లోకి వెళ్లి తుపాకి తో కాల్చుకున్నాడు. తుపాకి శబ్దాన్ని గమనించిన సహచరులు వెంటనే బాత్‌రూమ్‌ వద్దకు వెళ్లి డోర్‌ తీయగా హెడ్‌కానిస్టేబుల్‌ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారమందుకున్న పోలీసు ఉన్నతాధికారులు హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలతోనే చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు