- బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్
సూర్యాపేట : ప్రతి ఒక్కరు సైనికుల్ల పనిచేయాలని బిఎస్పి ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ అన్నారు.గురువారం సూర్యాపేట మండలం రామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సుమంత్ తో పాటు మరో 100 మంది బిఎస్పీ పార్టీలో చేరారు. మండలం మోదినిపురం చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే పట్టణంలోని 8వ వార్డుకు చెందిన అంతటి రావులమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆమె దశదినకర్మ అంతటి విజయ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా, జానయ్య యాదవ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సూర్యాపేట రూరల్ మండల గ్రామాలలోని బీఎస్పీ పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశం పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వట్టె జానయ్య యాదవ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లికి ఎలాంటి పదవి రాలేదు కానీ,మంత్రి జగదీష్ రెడ్డి బంధువైన ఎంసీ కోటిరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆరోపించారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో 100 కోట్ల రూపాయలు అవినీతికి గురయ్యాయని పేర్కొన్నారు.మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అవినీతి పై నిరూపించుకోవడానికి వాణిజ్య మార్కెట్ సెంటర్ కు రావాలని సవాల్ విసిరారు.దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేసి బీఎస్పీ పార్టీని గెలిపించాలని కోరారు.నియోజకవర్గంలోని మూడు పార్టీలు (బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి) కూడా వట్టె జానయ్య యాదవ్ తోనే పోటీ అని అనుకునే స్థితికి వచ్చామని అన్నారు.మరో వారం రోజుల్లో జానయ్య యాదవ్ గెలుస్తాడని ప్రచారం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.90 శాతం బహుజనులు ఉన్న బిఎస్పి పార్టీ కాకుండా సూర్యాపేట నియోజకవర్గ%శీ%లో వేరే పార్టీ గెలవబోదని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.డిసెంబర్ 3 తరువాత బీఎస్పీ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దొరలపై చేస్తున్న మన పోరాటానికి బూత్ స్థాయి కమిటీ ద్వారా పోరాటంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బుక్య కాంత, మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి లింగ నాయక్,పాతర్లపాడు సర్పంచ్ కేశబోయిన మల్లయ్య యాదవ్,సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ నాయక్, మాజీ కౌన్సిలర్ కుంభం రజిత నాగరాజు, బీఎస్పీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు చాంద్ పాషా, మీర్ అక్బర్, రామన్నగూడెం మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, మాజీ ఎంపిటిసి సూర సంధ్య వెంకన్న, మాజీ ఎంపిటిసి ముక్కాల పద్మ సుమన్, వల్లాల సైదులు, ఉపసర్పంచి కుంభం సుజాత వెంకన్న, నగిరి అన్వేష్,పార్టీ నాయకులు,కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.