Monday, May 6, 2024

బిఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులు తో గెలవలేరు : వి ఎస్ ప్రకాష్ రెడ్డి..

తప్పక చదవండి

నాచారం : ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులతో గెలవాలని ప్రయత్నం మూర్ఖత్వం అవుతుందని నాచారం డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జి వి ఎస్ ప్రకాష్ రెడ్డి అన్నారు. నాచారం డివిజన్ లోని వివిధ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి ఎస్ ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు డబ్బు సంచులకు సంతలో పశువుల లెక్క కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీ కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, శ్రీకాంత్, హెచ్ ఆర్ మోహన్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు