- నటుడు ప్రకాశ్ రాజ్పై కేసు నమోదు..
- వ్యంగంగా ఉండే ఫోటోను షేర్ చేసిన నటుడు..
- తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు..
బెంగళూరు :
చంద్రయాన్ – 3 మిషన్పై కామెంట్ చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్పై కర్నాటకలో కేసు నమోదు చేశారు. భగల్కోట్ జిల్లాలోని బానహట్టి పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. హిందూ సంఘాల నేతలు ఆ కేసు బుక్ చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చంద్రయాన్ – 3కి చెందిన ల్యాండర్ విక్రమ్ .. బుధవారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ వివాదాస్పద మైంది. ఓ కార్టూన్ను అతను పోస్టు చేశాడు. లుంగి కట్టుకున్న ఓ వ్యక్తి.. టీ పోస్తున్నట్లు ఆ కార్టూన్లో ఉంది. చంద్రుడి నుంచి వచ్చిన తొలి ఫోటో ఇదే అని ఆ పోస్టులో ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ఆన్లైన్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని విమర్శించడం సరికాదు అని నెటిజెన్లు అన్నారు.