తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చిన్న శేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఐదు తలల చినశేష వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు.
ఉత్సవాల్లో భాగంగా నేటి రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీకగా చెబుతారు. హంస పాలను, నీళ్లను వేరుచేయగల ప్రత్యేకత ఉన్నది. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలది అంటారు.
తప్పక చదవండి
-Advertisement-