Saturday, May 18, 2024

బీహార్ లో ఘోర ప్రమాదం..

తప్పక చదవండి
  • బాగమతి నదిలో పడవ బోల్తా..
  • గల్లంతైన 18 మంది పాఠశాల పిల్లలు..
  • సహాయక చర్యలు చేపట్టిన ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు..

ముజఫర్ పూర్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. బాగమతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. పడవలో 30 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భాగమతి నదిలోని భట్గామ మధుర్‌పట్టి పీపాల్ ఘాట్ నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక డైవర్లు చిన్నారులను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. నదిలో కొట్టుకు పోతున్న చాలా మంది పిల్లలను బయటకు తీశారు. అయినప్పటికీ చాలా మంది పిల్లలు నది ప్రవాహంలో కొట్టుకుని పోయారు.. ఆ చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది. భారీగా జనం గుమిగూడారు. నది ఒరవడి బలంగా ఉంది. దీంతో నదిలో కొట్టుకుని పోతున్న చిన్నారుల వద్దకు చేరుకోవడానికి డైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు. పిల్లలను రక్షించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే కొంతమంది చిన్నారులను రక్షించారు. అంతేకాదు ఈ విషాద ఘటనలో మరొక విషాదం ఏమిటంటే.. నదిలోకొట్టుకు పోతున్న చిన్నారులను రక్షించేందుకు వెళ్లిన యువకుడు కూడా గల్లంతైనట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు