ప్రాంతీయ వర్గాలకు, వర్ణాలకు
తావివ్వకుండా అందరి బతుకులు
సమానంగా సమసమాజంలో
ఉన్నతంగా తీర్చిదిద్దుతానని
ప్రమాణాలు చేసి..
కనీసం ప్రజాస్వామ్యంగానైనా
బతకనివ్వని స్థాయికి నేతలు ఎదిగారు.
అయినా ఇంకా వారినే గెలిపిస్తూ..
అధికారం కట్టబెడుతూ..
వాళ్ల అరాచకాలను కళ్లార చూస్తూ..
నిత్యం చస్తూ బతుకుతున్న
నా ప్రజాస్వామ్యమా నిండు నూరేళ్లు వర్ధిళ్లు
` మొగిలి ఉదయ్ కిరణ్
తప్పక చదవండి
-Advertisement-