- కదిలిన మేడ్చల్ మున్సిపల్ అధికారులు
- హర్షం వ్యక్తంచేసిన మేడ్చల్ ఆర్టీసీ కాలనీ వాసులు
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వాసులు ప్రతి రోజు ఉదయం లేవగానే దుర్వాసన సమస్యతో బాధపడుతున్నా ఏ ఒక్క నాయకుడు కాని అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఇట్టి సమస్యలపై బుధవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వార్త కథనం ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించి ఆర్టీసి కాలనీ పక్కనే ఉన్న తుమ్మ చెరువు పై పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ కవర్లను తొలగించి చెరువుకు ఇరువైపుల పరిశుభ్రం చేపించారు.,ఈ సందర్భంగా ఆర్టీసి కాలనీ వాసులు మాట్లాడుతూ ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనం వల్లే దుర్వాసన సమస్యతీరిందని అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ఆదాబ్ పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.