Friday, May 3, 2024

భార్యమీద కోపంతో అర్ధరాత్రి అత్త ఇంటికి నిప్పు పెట్టిన క్రిమినల్ అల్లుడు

తప్పక చదవండి
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఘటన
    వనపర్తి : భార్యతో గొడవపడిన ఒక వ్యక్తితో కోపంతో రగిలిపోయి అత్తింటికి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారని భావించి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అయితే లక్కీగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.
    భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఎంత పెద్ద గొడవనా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొందరు దంపతులు విచక్షణ మరిచిపోతున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. వనపర్తి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్యతో గొడవపెట్టుకున్న ఓ వక్తి.. ఆమెపై కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు. లక్కీగా ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన చిన్న భద్రయ్య, మణెమ్మ దంపతులకు కూతురు లక్ష్మి సంతానం. లక్ష్మిని అదే గ్రామానికి చెందిన పొయ్యికాటి శివయ్యకు ఇచ్చి 14 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. వారికి ఓ కుమారుడు. అయితే గత మూడేళ్లుగా శివయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మెుదలయ్యాయి. లక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. గత కొంతకాలంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. తన భార్యను కాపురానికి పంపించాలంటూ శివయ్య అత్తవారింటికి వచ్చి తరుచూ గొడవ పడేవారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు