Friday, May 3, 2024

టెట్ పరీక్షాకేంద్రంలో తీవ్ర విషాదం..

తప్పక చదవండి
  • 8 నెలల గర్భిణీ మృతి

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్‌ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్‌ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షకు టైమ్ అయిపోతుందనే కంగారులో పరీక్షా కేంద్రానికి వేగంగా చేరుకున్నారు. ఈ తరుణంలో ఆమెకు ఒక్కసారిగా చెమటలు పట్టి బీపీ పెరిగి పరీక్షా గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన ఇన్విజిలేటర్, తోటి అభ్యర్థులు, పోలీసులు, సిబ్బంది సాయంతో ఆమెను అంబులెన్స్‌లో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.

8 నెలల గర్భిణీ అయినా కూడా టెట్ పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివిందని భర్త అరుణ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కనేందని వాపోయారు. తీరా పరీక్ష రాయడానికి వస్తే హాలులోనే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోందని బోరున విలిపించాడు. అటు రాధిక ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు