Sunday, May 19, 2024

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలి 17 మంది మృతి..

తప్పక చదవండి
  • శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం
  • మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 17 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. కురుంగ్ న‌దిపై ఆ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అనేక మంది ఆ బ్రిడ్జ్ శిథిలాల కింద చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. సాయిరంగ్ నుంచి బైరాబి మ‌ధ్య ఆ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ ప‌నుల్లో దాదాపు 40 మంది వ‌ర్క‌ర్లు ఉండి ఉంటార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇనుప బ్రిడ్జ్ కింద చిక్కుకున్న 17 మంది కార్మికులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 30 మంది వ‌ర్క‌ర్లు శిథిలాల కింద ఉన్న‌ట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు