- ఫార్మా కంపెనీల్లో ఏకకాలంలో తనిఖీలు
- 9 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఐటీ
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని రాయదుర్గం, కోకాపేటల్లో మొయినాబాద్ సహా తొమ్మిది ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరోపణలతో.. ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.