న్యూఢిల్లీ : జాతీయ అర్హత పరీక్ష(నెట్) సిలబస్ను సవరించాలని యూనివ ర్సిటీ నిధుల సంఘం(యూజీసీ) నిర్ణయించింది. ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ మంగళవారం తెలిపారు.కొత్త సిలబస్ను ప్రవేశపెట్టే ముందు అ భ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇస్తామని చెప్పారు. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షగా యూజీసీ`నెట్ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు.