Monday, May 20, 2024

కత్తితో దాడి కేసును చేదించిన పోలీసులు

తప్పక చదవండి
  • నలుగురు నిందితుల అరెస్ట్‌… కత్తి, ఒక ఫోన్‌ స్వాధీనం
  • వివరాలు వెల్లడిరచిన సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం

సూర్యాపేట : పాత కక్షలు నేపథ్యంలోనే చీకూరి సంతోష్‌ పై కత్తి దాడి చేసిన నలుగురు వ్యక్తులను పోలీస్‌ లు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెలిపారు. శుక్రవారం సూర్యాపేట టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. చేకూరి సంతోష్‌ కి వడ్లకొండ కృష్ణ (అలియాస్‌ బంటికి) 2021 సంవత్సరంలో రూ .20 వేల డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడగ, చీకురి సంతోష్‌, కృష్ణ పై కత్తితో దాడి చేయగ,కేసు నమోదు అయ్యిందని తెలిపారు.ఈ మధ్యకాలం లోనే ఇరువురు ఎదురుపడినప్పుడల్లా చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, ఇలా ఉంటే ఎన్ని రోజులకైనా చంపేస్తాడని భయంతో, వడ్లకొండ కృష్ణ, చెరుకుపల్లి మహేష్‌, జాజుల మణిదీప్‌ (అలియాస్‌ సన్నీ), శంకర శెట్టి ఫ్రేమ్‌ నాయుడు తో కలిసి గురువారం మధ్యాహ్నం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఒక కత్తి స్వాధీనం చేసుకోగా, నిందితుడు నుండి ఫోన్‌ స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన 24 గంటల్లోగా కేసు ను చేదించినందుకు టౌన్‌ పోలీస్‌ లును అభినందించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అనుమానిక వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం ఇయ్యాలని,అలాగే ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టౌన్‌ సిఐ రాజశేఖర్‌, సిఐ పడిశాల శ్రీనివాస్‌, ఎస్సై లు యాకూబ్‌,సైదులు తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు