Friday, May 17, 2024

తాగి రాంగ్ రూట్‌లో లారీ నడిపి ఆటోను ఢీకొట్టిన డ్రైవర్..

తప్పక చదవండి
  • వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం
  • ఆరుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం

వరంగల్‌ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. వరంగల్‌ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చనిపోయారు. బాధితులు తేనె విక్రయించే కూలీలుగా తెలిసింది. మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌ భట్టు శ్రీనివాస్‌ది వరంగల్‌లోని శివనగర్‌. నితీశ్‌, జాబోదు, రూప్‌చంద్‌ రాజస్థాన్‌కు చెందిన వారు కాగా.. సురేశ్, మేరీ బిహార్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి అమీర్‌ రాజస్థాన్‌కు చెందిన వాడని వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు