Wednesday, May 8, 2024

రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు..

తప్పక చదవండి
  • వరంగల్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలపై అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
  • మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో తుది జాబితా రూపొందించాలని సూచన..
  • జర్నలిస్టుల భేటీలో వెల్లడించిన మంత్రి..

హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్, ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు ఎక్కడ కేటాయించారో వాటి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబరు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ను టీయూడబ్ల్యూజే 143 నేతలు ఇళ్ళ స్థలాలు, జర్నలిస్ట్ సమస్యలపై కలిశారు. వరంగల్ జిల్లాలో రెండు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలు ఉండగా, అధికారులు గతంలోనే వాటికి భూములను కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబర్ ఇస్తే తాము డబ్బులు చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హౌసింగ్ సొసైటీల్లో లేని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై టీయూడబ్ల్యూజే 143 నేతలు లెనిన్ , కక్కెర్ల అనిల్ కుమార్ గౌడ్, తుమ్మ శ్రీధర్ రెడ్డి, మెండు రవీందర్, చిలుముల సుధాకర్, వెంకన్న,రాజేంద్రప్రసాద్, తదితరులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు పోగా, మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు కేటీఆర్ సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి కూడా ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని స్పష్టమైన హామీ ఇచ్చారు. హైదరాబాద్ జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాలపై కూడా నిన్ననే అల్లం నారాయణతో మాట్లాడానని, జే ఎన్ జే సొసైటీతో సహా ప్రతి జర్నలిస్ట్ కు ఇళ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రితో భేటీ అయిన వారిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు