Wednesday, May 15, 2024

మార్క్‌ ఆంటోని మూవీ బీభత్సం..

తప్పక చదవండి
  • రెండు రోజుల్లో 25 కోట్లు వసూలు..

హైదరాబాద్ : దాదాపు ఐదేళ్ల తర్వాత విశాల్‌ హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆషామాషీహిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్‌ దగ్గర రీ సౌండ్ వినిపిస్తుంది. ఇప్పటికే కెరీర్‌లో హైయెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించి రికార్డు సృష్టించగా.. రెండో రోజు తొలిరోజుకు మించి కలెక్షన్‌లు సాధించాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్‌ హీరోగా నటించాడు. మూడు రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు తెలుగులో మిక్స్డ్‌ రివ్యూలు వచ్చినా.. తమిళనాట ఊహించని స్థాయిలో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లోనే పాతిక కోట్లకుపైగా కలెక్షన్స్‌ కొల్లగొట్టింది. అంటే రెండు రోజుల్లోనే రూ.12 కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. మరో ఐదున్నర కోట్లు కలెక్ట్‌ చేస్తే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ను పూర్తి చేసుకుంటుంది. తెలుగులోనూ ఈ సినిమాకు సాలిడ్‌ కలెక్షన్స్‌ వస్తున్నాయి. తొలిరోజు కోటిన్నరకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్‌లో దూసుకుపోయింది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్‌.జే సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. విశాల్‌కు జోడీగా రీతూవ‌ర్మ, అభినయలు నటించారు. ఇక ఈ సెప్టెంబర్‌ 22న ఈ సినిమా హిందీలో రిలీజ్‌ కాబోతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు