Tuesday, May 14, 2024

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

తప్పక చదవండి

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటన్న అత్త షేక్‌ చాంద్‌బీని అల్లుడు మహబూబ్‌ సుభాని ఆదివారం హత్యచేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
తనకు ఆస్తి ఇవ్వనందుకే హత్య చేసినట్లు పోలీసులకు వివరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు