Friday, May 17, 2024

గవర్నర్ వద్దే ఆర్టీసీ బిల్లు..

తప్పక చదవండి
  • బిల్లును పరిశీలించేందుకు కొంత సమయం కావాలన్న గవర్నర్..
  • ఆర్ధిక బిల్లు కావడంతో ముందుగా ఆమోదం కోసం వెళ్లిన బిల్లు..
  • బిల్లు గురువారమే తన వద్దకు వచ్చిందన్న గవర్నర్..
  • బిల్లుపై న్యాయ సలహాలు తీసుకుంటానని వెల్లడి..
  • నేడే సమావేశాల చివరి రోజు కావటంతో సర్వత్రా ఆసక్తి..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక బిల్లు కావడంతో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గవర్నర్ తమిళిసై‌ ఆమోదం కోసం పంపించింది. అయితే, ఈ బిల్లుకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందని చెప్పారు. బిల్లును పరిశీలించి న్యాయ సలహాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం కావాలన్నారు. మరోపక్క, తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని భావించింది.

కావాలనే గవర్నర్ ఈ బిల్లుపై స్పందించలేదన్న విమర్శలపై ఆమె స్పందించారు. తనకు బిల్లు మొన్న మధ్యాహ్నం అందిందని.. కొంత సమయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను నేటితో ముగించాలని సర్కార్ చూస్తోంది. ఆర్టీసీ విలీన బిల్ ను ఇవాళ కానీ రేపు గానీ వస్తే.. ఆదివారం రోజు కూడా సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ గవర్నర్ రేపటి వరకు ఆమోదించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తిగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆసంస్థలో పనిచేస్తున్న 43, 373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారం గవర్నర్‌, గవర్నమెంట్ మధ్య మరోసారి వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న టైంలో కొన్నింటికి గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంతో వివాదానికి కారణవుతోంది. టెక్నికల్‌గా ఇది ఆర్థిక బిల్లు అయినందున ముందు గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ బిల్లు అనుమతి కోసం గవర్నర్‌ తమిళిసై వద్దకు పంపించి ప్రభుత్వం. ఈ సమావేశాల్లో కచ్చితంగా ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. శాసన సభ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే రెండు రోజులు సమావేశాలు పూర్తయ్యాయి. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంత వరకు గవర్నర్ నుంచి ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి కదలిక లేదు. దీనిపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. చాలా మంది పేదలకు న్యాయం చేద్దామని చూస్తుంటే రాజ్‌భవన్‌ నుంచి సానుకూల స్పందన రాలేదంటున్నారు. మొదటి నుంచి గవర్నర్‌ ఇదే తీరున వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -

బిల్లును ఆమోదించాలా లేదా అన్నది గవర్నర్ ఇష్టం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ అభ్యంతరం చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఇలాంటి సమయంలో.. బిల్లు విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తమిళిసై ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ వారం రోజులపైగా సాగితే.. ప్రభుత్వ ప్రయత్నాలకు ఇబ్బంది ఎదురయినట్లే అనుకోవచ్చు. మరోవైపు… ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. ఈరోజు ఒక్క రోజే సమయం ఉండగా.. గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటం వల్ల.. మరి సమావేశాల గడువు ఇంకా పొడిగించనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా.. ఇప్పటికే పలు బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసైకి ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా పలు బిల్లులను గవర్నర్.. పెండింగ్‌లో పెట్టటం.. అందులో కొన్నింటిని తిరిగి పంపిచేయటం రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య దూరాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా మూడు బిల్లులకు ఆమె ఆమోదం తెలపలేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ టీఎస్ ఆర్టీసీ బిల్లు విషయంలోనూ ఆలస్యం చేస్తుండటంతో మళ్లీ గవర్నర్ వర్సెస్ కేసీఆర్ సర్కార్‌గా మారనుందా అన్న విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు