Saturday, May 18, 2024

మాది అధికారిక కార్యక్రమం.. మేం ముందే దరఖాస్తు చేసాం..

తప్పక చదవండి
  • రాజుకుంటున్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సభల వివాదం..
  • పొలిటికల్ మైలేజీ కోసం ప్రాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..
  • పరేడ్ గ్రౌండ్ పై పట్టుబడుతున్న ఇరు పార్టీలు..
  • ఎవరు 17 న పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతారన్న దానిపై ఉత్కంఠ..

హైదరాబాద్ :సెప్టెంబర్‌ 17వ తేదీకి కౌండ్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది. సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ ఎప్పుడు లేని విధంగా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, మరో వైపు విమోచన దినోత్సవం సమీపిస్తుండటంతో ఆ తేదీన తమ బలబలాలను చూపించుకునేందుకు ఆయా పార్టీలు సన్నద్దమవుతున్నాయి.

అయితే ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని, అంతేకాకుండా పొలిటికల్ మైలేజీ పొందాలని కాషాయం నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను గత యేడాది నిర్వహించారు. సాంస్కృతి కార్యక్రమాలు, బైరాన్ పల్లి లాంటి ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు. గత యేడాది తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

- Advertisement -

అదే సంప్రదాయాన్ని ఈ యేడాది కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల యేడాది కావడంతో.. ఈ సారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి వెళ్లెలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే ఈ సభకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఎవరిని రప్పించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు ఈ నెల 16,17, 18 వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు