Sunday, May 5, 2024

ధరలకు కళ్లెం వేసేందుకే!

తప్పక చదవండి
  • ఉల్లి ఎగుమతులపై కేంద్రం భారీ వడ్డన..
  • ఇటీవలి వరకు భగ్గుమన్న టమాటా ధరలు
  • ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధింపు
  • డిసెంబరు 31 వరకు వర్తించేలా సుంకం పెంపు
  • తక్షణమే అమల్లోకి ఎగుమతి పన్ను

న్యూఢిల్లీ : కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఉల్లిగడ్డ ధరలు పెరగకుండా నిరోధించేందుకు, దేశీయ మార్కెట్‌లో ఉల్లి సరఫరాను పెంచేందుకు ఈ ఎగుమతి సుంకం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఉల్లిగడ్డలు దేశీయంగా అందుబాటులో ఉంచడం కోసమే ఈ సుంకం విధించామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌ లో వెల్లడిరచింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో ఇటీవలి వరకు టమాటాల ధర భగ్గుమన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టమాటాలు కిలో రూ.250కి పైన ధర పలికాయి. ఇప్పుడు ఉల్లి కూడా అదే దారిలో పయనించే పరిస్థితులు ఉండడంతో, కేంద్రం ఇటీవలే తన నిల్వల నుంచి 3 లక్షల టన్నులు ఉల్లిగడ్డలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు