Friday, May 17, 2024

డబ్బా కొట్టుకోవడం వారికి అలవాటే..

తప్పక చదవండి
  • ఎమ్మెల్సీ కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు..
  • కవితావల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది అన్నది హాస్యాస్పదం..
  • తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేరు..
  • ఇప్పుడు కవిత కూడా ఎంపీ కాదు..

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత వల్లే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందన్న బీ.ఆర్.ఎస్. పార్టీ వారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.. తెలంగాణ వచ్చినప్పుడు కే. చంద్రశేఖర్ రావు పార్లమెంట్ లో లేడు.. మహిళా బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు.. అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం.. సిగ్గుచేటు.. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే తానే మహిళా బిల్లు తెచ్చినట్లు డబ్బా కొట్టుకుని, జనం చెవుల్లో పూలు పెట్టి ఉండేది.. అంటూ రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు