సూర్యాపేట : కుమారుడిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న జిల్లాలోని పెన్ పహాడ్ మండలం పొట్లపహడ్ ఎంపీటీసీ సీతారాములు కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఓదార్చారు. మంగళవారం విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన పోట్ల పహాడ్కు చేరుకున్న మంత్రి.. విక్రమ్ గౌడ్ పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రి వెంట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జడ్పీటీసీ మామిడి అనిత, మండల పార్టీ అధ్యక్షుడు యుగేందర్, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, సర్పంచ్ రామినేని కృష్ణయ్య, చిన్న శ్రీనివాస్ రెడ్డి, మామిడి శోభన్, పెన్ పహాడ్ మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.
తప్పక చదవండి
-Advertisement-