Monday, April 29, 2024

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఇద్దరు ఎమ్మెల్సీలు

తప్పక చదవండి

హైదరాబాద్ : గవర్నర్‌ కోటాలో నియితులైన ఇద్దరు ఎమ్మెల్సీలు కోదండరామ్‌, అవిూర్‌ అలీఖాన్‌ను శనివారం సచివాలయంలో సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరిని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అమోదించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు. వీరిద్దర్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ మొదట వీటి భర్తీ కోసం దాసోజు శ్రవణ్‌, కె.సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఈ ఫైలును గవర్నర్‌కు పంపించగా ఆమె తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు శనివారం సీఎంను కలసి అభినందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు