- లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ కరస్పాండెంట్ సత్య ప్రకాష్ యాదవ్
లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ఫీట్ల అతి పొడవైన జాతీయ జెండాను రూపొందించినారు. స్కూల్ కరస్పాండెంట్ సత్య ప్రకాష్ యాదవ్ జాతీయ జెండా ఎగరవేసి విద్యార్థులతో కలిసి జాతీయగీతం ఆలపించినారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండ్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలోనే మా స్కూల్ నందు రూపొందించిన జెండా అతి పెద్దదని పేర్కొన్నారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. జలియన్వాలాబాగ్ ఉదంతం సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారు.