Friday, May 17, 2024

జర్నలిస్టులకు దళిత బంధు, ఇంటి స్థలాలు ఇవ్వాలి..

తప్పక చదవండి
  • తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న జర్నలిస్టులకు దళిత బంధు, ఇంటి స్థలం, ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మాదిగ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. గతేడాది హైదరాబాద్ లో జరిగిన దళిత జరలిస్టుల శిక్షణా తరగతుల సందర్భంగా రాష్ట్ర ఎస్ సి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జర్నలిస్టులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాల్వాయి బాలయ్య, ఉపాధ్యక్షుడు మైలారపు ప్రేమ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్, రాష్ట్ర నాయకులు ఓగ్గు సోమన్న, పల్లేటి నాగార్జున, బొల్లికొండ సతీష్, జానీ, బాబు, నర్సయ్య, ఉపేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు