Friday, May 3, 2024

దేశంలో క్రమంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా..

తప్పక చదవండి
  • ప్రస్తుతం యువత అధికంగా ఉన్న భారత్
  • కీలక విషయాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
  • 2099 నాటికి 36 శాతం చేరనున్న వృద్ధ జనాభా..

న్యూ ఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్. ప్రస్తుతం ఉన్న యువభారతంగా ఉన్న మన దేశం ఈ శతాబ్ధం చివరి నాటికి వృద్ధులతో నిండిపోతుందని తాజాగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వృద్ధుల జనాభా ప్రస్తుతం 10 శాతం ఉండగా.. అది 2099 నాటికి 36 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు అత్యధిక యువ జనాభా ఉన్న చైనా.. ప్రస్తుతం వృద్ధులతో నిండిపోయింది. భవిష్యత్‌లో భారత్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి-యూఎన్ఎఫ్‌పీఏ.. తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే యువశక్తి ఎక్కువగా ఉన్నపుడు ఏ దేశమైనా అభివృద్ధిలో దూసుకుపోతుంది. అదే యువత కొన్నేళ్లు గడిచిన తర్వాత వృద్ధులుగా మారితే వారు దేశానికి భారంగా మారుతారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అత్యధిక వృద్ధులు కలిగి ఉన్న చైనా.. అదే సమస్యతో బాధ పడుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్‌లో వయోధికుల సంఖ్య పెరగడం ప్రారంభమైందని.. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి-యూఎన్‌ఎఫ్‌పీయే తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ చెబుతోంది. 2021లో 60 ఏళ్లు దాటిన వృద్ధులు భారత్‌లో 10.1 శాతం ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఈ సంఖ్య 2036 నాటికి 15 శాతానికి చేరుకుంటుందని.. 2050లో అయితే ఏకంగా 20.8 శాతానికి ఎగబాకుతుందని యూఎన్ఎఫ్‌పీఏ నివేదిక అంచనా వేసింది. ఇక ఈ శతాబ్దం చివరి నాటికి అంటే 2099 వరకు ఇది దాదాపుగా దేశంలో ఉన్న జనాభాలో 36 శాతానికి చేరుకుంటుందని స్పష్టం చేసింది. అయితే 2010 ఏడాది నుంచి 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య క్రమంగా తగ్గడం.. వయోధికులు పెరగడం అనేది ప్రారంభమైందని వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశం వృద్ధాప్యం వైపు వెళ్తోంది అని చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనమని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో ఎక్కువ వయసు ఉన్నవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని.. 2050 నాటికి ఈ సంఖ్య పిల్లల సంఖ్యను దాటేస్తుందని అంచనా వేసింది. దీని ప్రకారం 2046 నాటికి భారత్‌లో 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లల సంఖ్య కంటే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. దీంతో ప్రస్తుతం యువభారత్‌గా ఉన్న దేశం కాస్త వృద్ధ భారత్‌గా మారుతుందని అని యూఎన్‌ఎఫ్‌పీయే తాజా నివేదిక తెలిపింది. దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతంలోని హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌లలో 2021 జాతీయ సగటు కంటే ఆయా రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య అధికంగా ఉందని పేర్కొంది. ఈ సంఖ్య 2036 నాటికి మరింత ఎక్కువ అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనాలు చెబుతున్నాయి. ఇక దేశంలో సంతాన సాఫల్య రేటు ఎక్కువగా ఉన్న బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2021 నుంచి 2036 మధ్య వృద్ధుల జనాభా శాతం జాతీయ సగటుకంటే తక్కువ ఉంటుందని తెలిపింది. 1961 నుంచి ప్రతి పదేళ్లకు వృద్ధుల సంఖ్య సాధారణం నుంచి అధికంగా పెరుగుతోందని వెల్లడించింది. 2001 సంవత్సరానికి ముందు ఈ పెరుగుదల నెమ్మదించినా వచ్చే కొన్ని దశాబ్దాల్లో మరింత పెరుగుతుందని తెలిపింది. 2021 జనాభా అంచనాల ప్రకారం దేశంలో ప్రతి 100 మందిలో 39 మంది వృద్ధులున్నారని తెలిపింది. దక్షిణాది, పశ్చిమ భారత ప్రాంతాలతో పోలిస్తే మధ్య, ఈశాన్య భారత ప్రాంతాల్లో యువత ఎక్కువగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు