Saturday, May 4, 2024

చంద్ర మండలంలో మూడెకరాలిస్తానంటడు..

తప్పక చదవండి
  • కేసీఆర్ హామీలన్నీ మోసపూరితమే
  • ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సగం మందికి టిక్కెట్లు రావు
  • ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్దమైనరు
  • మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అనేక కుట్రలు చేస్తున్న కేసీఆర్
  • గణేష్ ఉత్సవాల పేరుతో ఎమ్మెల్యేలకు డబ్బులు పంపిన కేసీఆర్
  • తామే నిఖార్సైన హిందువుగా నమ్మించేందుకే ఉత్సవాలకు పైసల పంపిణీ
  • కేసీఆర్ కు ఓటేస్తే తెలంగాణ ప్రజల బతుకులు సర్వనాశనమైతయ్
  • కేసీఆర్ బిడ్డకు టిక్కెట్ ఇస్తే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలైనట్లేనా?
  • ప్రజలంతా ఆలోచించుకోవాలని బండి సంజయ్ పిలుపు..

ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని దొంగ హామీలైనా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఒక్కో కుటుంబానికి చంద్ర మండలంలో 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కేసీఆరే చెప్పారని, అట్లాంటప్పుడు వారందరినీ బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించడం విడ్డూరమన్నారు. దీని వెనుక కేసీఆర్ మాస్టార్ ప్లాన్ ఉందని, తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి అందులో సగం మందికి టిక్కెట్లు ఇవ్వకుండా ఎగ్గొడతారని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుసుకున్న కేసీఆర్.. దీనిని అడ్డుకునేందుకు హడావుడిగా అందరికీ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటిస్తూ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని చెప్పారు.

ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొద్దిసేపు చర్చించారు. కర్నాటక, తమిళనాడు, యూపీ, అసోంకి చెందిన ఎమ్మెల్యేలు సీకే రామస్వామి, బస్వరాజ్, ధర్మేశ్వర్ కోన్వర్, దిగంత కలిత, మునిరాజ్, శశాంక్ త్రివేది, హేమంత తగురియా తదితరులు బండి సంజయ్ ను కలిసిన వారిలో ఉన్నారు.
అంతకుముందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలతో కలిసి బండి సంజయ్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ తనను కలిసిన మీడియాతో మాట్లాడారు.
శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రజల కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కల్పించాలని అమ్మవారిని వేడుకున్నా. కేసీఆర్ బిడ్డకు టిక్కెట్ ఇస్తే మహిళా రిజర్వేషన్లకు న్యాయం జరిగినట్లేనేమో. 33 శాతం రిజర్వేషన్లు అమలైనట్లేనా?. మొదటి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా ఎందుకు చోటు ఇవ్వలేదు? ఇప్పుడెంత మంది మహిళలున్నారు. కేసీఆర్ బిడ్డ సమాధానం చెప్పాలి. కేసీఆర్ ది చాట్ల తవుడు పోసి కొట్లాడి పెట్టేరకం. మొన్న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సగం మందికి బీ.ఫాంలు రానేరావు. ఎందుకంటే వీరంతా 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేసీఆరే చెప్పారు. అయినా ఇట్లోంటోళ్లకు, కబ్జాదారులకు టిక్కెట్లు ఇస్తామని చెప్పారంటే దీనివెనుక పెద్ద మతలబుంది. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నరు.. దాన్ని అడ్డుకునేందుకే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారు. పార్టీకి కాపాడుకోవడానికి ఎత్తుగడలో భాగమే. తీరా ఎన్నికల సమాయానికి సర్వేల పేరుతోనో, ప్రజలను ఇబ్బంది పడుతున్నారనే పేరుతో సగం మంది సిట్టింగులకు టిక్కెట్లు ఎగ్గొడతారు. పైగా కాంగ్రెస్ కు సంబంధించి 30 మందికి ఎమ్మెల్యే అభ్యర్థులకు ముందుగానే కేసీఆర్ డబ్బులిచ్చారు. గెలిచాక వాళ్లను కూడా బీఆర్ఎస్ లోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే కేసీఆర్ ఎత్తుగడ. దీంతోపాటు ఈసారి వినాయక చవితి పండగకు కూడా పైసలిచ్చి తమవైపు తిప్పుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసిండు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉత్సవాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు పంపిండు. ఎక్కడా కాషాయ జెండా ఉండొద్దని, బీఆర్ఎసోళ్లే నిఖార్సైన హిందువులుగటా నటిస్తూ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. చంద్రయాన్ 3 సక్సెస్ ను కూడా ఉపయోగించుకుంటాడేమో. బీఆర్ఎస్ కు ఓటేస్తే చంద్రమండలంలో ప్రతి కుటుంబానికి మూడెకరాల స్థలమిస్తానని మోసం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కేసీఆర్ కు తెలియంది ఏందంటే… ఏం చేసినా ఆయన ప్రభుత్వం కూలిపోక తప్పదు.. ఇప్పటికే కేసీఆర్ ను నమ్మిన ప్రజలు కష్టాలు పడుతున్నరు. మళ్లీ ఓట్లేసే తెలంగాణ ప్రజల బతుకులు నాశనమైతయ్. ప్రజలంతా ఆలోచించుకోవాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు