Saturday, May 4, 2024

బాలికను కిడ్నాప్ చేసిన తండ్రి స్నేహితులు..

తప్పక చదవండి
  • హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి

లక్నో: స్కూల్‌కు వెళ్తున్న బాలికను ఆమె తండ్రి స్నేహితులు కిడ్నాప్‌ చేశారు. ఒక హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న బాలిక ఆటోలో స్కూల్‌కు వెళ్తున్నది. తండ్రి స్నేహితులైన తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఆమె ప్రయాణించిన ఆటోను అడ్డుకున్నారు. బలవంతంగా తమ బైక్‌పై ఎక్కించుకుని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అత్యాచారాన్ని వీడియో రికార్డ్‌ చేశారు. ఎవరికైనా చెబితే వీడియోను వైరల్‌ చేస్తామని బెదిరించారు. కాగా, బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన కుటుంబానికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు