Wednesday, May 15, 2024

కెనడా ప్రధాని ట్రూడోకు తగ్గుతున్న ప్రజాదరణ

తప్పక చదవండి

ఒట్టావా : ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గట్టి షాక్‌ తగిలింది. దేశంలో ప్రధానిగా ఆయన పాపులారిటీ తగ్గుతోంది . కెనడియన్స్‌ ఎక్కువమంది ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పోయిలీవర్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రధానిగా 40 శాతం మంది ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేతో పోలిస్తే.. ప్రధానిగా పియరీ పాపులారిటీ ఐదు శాతం పెరగడం విశేషం. ఇక ట్రూడో పాపులారిటీ మాత్రం నిలకడగా 31 శాతం వద్దే స్థిరపడిరది.కెనడాలో 2025లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీకి 39 శాతం ఓట్లు వస్తాయని పోల్స్‌లో తేలింది. ఇక లిబరల్‌పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత ప్రధాని ట్రూడో 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని గ్లోబల్‌ న్యూస్‌ నివేదించింది. అంతేకాదు, ట్రూడోకు అండగా ఉన్న న్యూ డెమొక్రటిక్‌ పార్టీ నేత జగ్మీత్‌ సింగ్‌ ప్రజాదరణ కూడా తగ్గుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే నాలుగు శాతం తగ్గింది. అప్పుడు ఆయనకు మద్దతు తెలుపుతున్న వారు 26 శాతం కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 22శాతానికి పడిపోయింది. అన్నింటి కంటే ముఖ్యంగా దాదాపు 60 శాతం మంది కెనడియన్స్‌ ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు