Wednesday, May 15, 2024

కాంగ్రెస్‌ను బద్నామ్‌ చేసే కుట్ర

తప్పక చదవండి
  • బిఆర్‌ఎస్‌ 420 బుక్‌లెట్‌పై విహెచ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నేతలకు పనిలేక 420 బుక్‌ లెట్‌తో కాంగ్రెస్‌ పార్టీని బద్నామ్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపెంచారన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవరు స్తుందని బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన దళితులకు మూడు ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగ హామీలు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందన్నారు. రాష్ట్రంలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సోనియా గాంధీని అత్యధిక మెజారితో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీకి ప్రధానిని చేసి ఇండియా కూటమిని గెలిపిస్తామని వీహెచ్‌ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు