- ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆటగాళ్లు
కాన్పూర్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్లో విద్యార్థులు చితకొట్టుకున్నారు. కళాశాలలో శనివారం జరిగిన వార్షిక క్రీడా కార్యక్రమంలో రెండు కబడ్డీ జట్ల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వైఎంసీఏ`ఎన్ఎస్యూటీ జట్ల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పడి మరీ తన్నుకున్నారు. కుర్చీలతో దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ ఘర్షణకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై ఐఐటీ కాన్పూర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.