నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి ఒంటి గంట వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది. అక్కడ ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేతబూని నగర వీధుల్లో హోరెత్తించారు.