Saturday, July 27, 2024

విపక్షం అభాసుపాలైంది : ప్రధాని మోడీ..

తప్పక చదవండి
  • వారి అవిశ్వాసంతో మపై మరింత విశ్వాసం పెరిగింది..
  • అనేకసార్లు అవిశ్వాసం పెట్టి చేతులు కాల్చుకున్న సంగతి మరిచారు..
  • భారత్‌ ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది..
  • అది ఇండియా కూటమి కాదు.. ఘమిండియా
  • అదో వారతస్వ రాజకీయ కూటమి..
  • మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం..
  • వాళ్ళు నోబాల్స్ వేస్తున్నారు.. మేము సిక్సర్లు కొడుతున్నాం..
  • విశ్వాస పరీక్షపై చర్చలో ఘాటుగా సమాధానం ఇచ్చిన మోడీ..
    న్యూ ఢిల్లీ : విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని ప్రధాని మోడీ చురకలంటించారు. బహుశా ఆ భగవంతుడే దిగొచ్చి.. ప్రతిపక్షాలకు అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడంటూ సెటైర్లు వేశారు. విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు అదృష్టమేనన్న మోడీ.. తాము మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయని, అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయని అన్నారు. పార్లమెంట్‌లో ’ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. ఇదే సమయంలో.. 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారని ఉద్ఘాటించారు. 2028లో విూరు అవిశ్వాసం తెచ్చేనాటికి.. భారత్‌ 3వ ఆర్థిక శక్తిగా నిలుస్తుందని మోడీ జోస్యం చెప్పారు. జనధన్‌ ఖాతాల గురించి తక్కువచేసి మాట్లాడారని.. యూపీ, బిహార్‌, గుజరాత్‌ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్‌పై అన్నిరాష్టాల్ర ప్రజలు అవిశ్వాసం ప్రకటించారని.. అహంకారంతో నిండిన కాంగ్రెస్‌కు నేల కనిపించడం లేదని ఫైర్‌ అయ్యారు. 1991లో భారత్‌ అప్పుల కోసం ప్రపంచం వైపు చూసిందని.. 2014 తర్వాత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందని అన్నారు. తమ పనితీరు, నిబద్ధతతోనే దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి తీరుతామని మోడీ తేల్చి చెప్పారు. విపక్షాలు వరుసగా నోబాల్స్‌ వేస్తుంటే.. అధికార పక్షం ప్రతీసారి ఫోర్లు, సిక్సులు కొడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ.. అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలకు పేదల గురించి ఆలోచన లేదని.. అధికారంలోకి రావడమే వారి పరమావధి అని కౌంటర్‌ వేశారు. విపక్షాలు ఇన్నాళ్లూ దేశాన్ని నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప చేసిందేవిూ లేదన్నారు. 1999లో శరద్‌ పవార్‌ నాయత్వంలో, ఆ తర్వాత సోనియా నేతృథ్వంలో 2003, 2018లో అవిశ్వాసం పెట్టారని.. ఇన్నిసార్లు అవిశ్వాసాలతో వాళ్లు సాధించిందేంటని ప్రశ్నించారు. కార్మికులను విపక్షాలు రెచ్చగొట్టినా, నేడు ఎన్‌డిఎ విజయపథాన నడుస్తోందని.. చరిత్రలోఅత్యధిక ఆదాయం నమోదు చేసిందని మోడీ తెలిపారు. బ్యాంకులు మునిగి పోతున్నాయని, నాశనం అవుతున్నాయని శాపనార్దాలు పెట్టారని.. కానీ అందుకు భిన్నంగా బ్యాంకులన్నీ మరింత బలోపేతం అయ్యాయన్నారు. కేవలం బలోపేతం కావడమే కాకుండా లాభాలబాట పట్టాయన్నారు. ఎల్‌ఐసి మునిగిపోతోందని, పేదల సొమ్ము కట్టబెడుతున్నారంటూ ప్రచారం చేశారని, స్టాక్‌ మార్కెట్‌లో దాని విలువ చూసి మాట్లాడండని హితవు పలికారు.. మోడీకి సమాధి తవ్వుతున్నారంటూ అపభ్రంశాలు పలుకుతున్నారని.. అమంగళం, అపభ్రంశాలతో మోడీని ఎవ్వరూ ఆపరలేరని తేల్చి చెప్పారు. తాము ఏం చేయకుండానే భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందా? అని మోడీ నిలదీశారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన గానీ, స్థాయి గానీ కాంగ్రెస్‌కు లేదని మోడీ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ, దేశం పట్ల కాంగ్రెస్‌కు దిశదశ లేదన్నారు. ప్రతి దాన్ని విమర్శించడం తప్ప ఆలోచనా విధానం లేదన్నారు. స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా సాధ్యం కాదని అన్నారని.. మేకిన్‌ ఇండియా అని చెప్పినప్పుడు కూడా ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, దాని స్నేహితులకు భారత్‌ సామర్థ్యంపై నమ్మకం లేదన్నారు. సరిహద్దుల్లోకి వచ్చి పాక్‌ కాల్పులు జరిపినప్పుడు నోరెళ్లబెట్టి చూశారని.. పాక్‌ మాటలు నమ్మి, కశ్మీర్‌లో నిత్యం అశాంతి నెలకొనేలా చేశారని ఆరోపించారు. కశ్మీర్‌పై, కశ్మీర్‌ పౌరులపై కాంగ్రెస్‌కు విశ్వాసం లేదన్నారు. కానీ.. తాము పాక్‌పై సర్జికల్‌ స్టైక్స్‌ చేశామన్నారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేయడం కాంగ్రెస్‌కు చాలా ఇష్టమని.. భారత్‌ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌పై వారికి నమ్మకం లేదని మోడీ మండిపడ్డారు. మణిపూర్‌లో పరిస్తితి దారికొచ్చిందన్నారు. అక్కడ పరిస్థితులు చక్కబడుతుంటే తట్టుకోవడం లేదన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు