- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు…
నందిగామ : పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎర్రగారి జనార్దన్ కుమా రుడు అనిరుధ్ (5), ఇంటి పక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పాము కాటువేసింది. వెంటనే బాలుడు తన తల్లికి విషయాన్ని తెలుపగా హుటాహుటిన షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేశారు.మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి పంపగా మార్గమద్యంలోనే అనిరుధ్ చనిపోయినట్లు తెలిపారు. ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆడుకుంటూ, పెద్దలను సైతం ఆప్యాయతగా పలకరించే అనిరుద్ పాము కాటుకు బలికావడం అందరి హృదయాలను కలచివేసింది.కళ్ళముందు ఆడుకుని బయటకు వెళ్లి ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది…
తప్పక చదవండి
-Advertisement-